Site icon TeluguMirchi.com

ఒకే కులానికి ప్రాధాన్యం ఇస్తే జగన్ కు అదే గతి…!

గత ప్రభుత్వంలాగే జగన్‌ ఒకే కులానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆయనకూ చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. ఇలాగే ఉంటే జనం జగన్‌ను కూడా ఇంటికి పంపుతారని బీజేపీ ఏపీ పదాధికారుల ముగింపు సభలో చౌహన్ సీఎం జగన్ పై విమర్షలు ఎక్కుపెట్టారు. 25లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించి బీజేపీని బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

 

ఏపీలో బీజేపీ ఎవరితోనూ పొత్తుకోరదని, ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపడుతుందన్నారు చౌహాన్. రెండోసారి సొంతంగా 303 సీట్లు గెలిచి సత్తా చాటాం. ఇక బీజేపీని దేశం నలుమూలలా బలోపేతం చేయబోతున్నాం. ఏపీలో 2014లోనే కాంగ్రెస్‌ పని ఫినీష్ అయిందన్నారు. పరుగు పందెంలో ఉండాల్సిన కాంగ్రెస్‌ చీఫ్ రాహుల్‌ మధ్యలోనే పారిపోయారు అంటు సెటైర్లు విసిరారు.

Exit mobile version