సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన !

seemandraసచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు (సోమవారం) కూడా ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగులు
హెచ్చరించారు.