త్వరలోనే పార్లమెంట్ కు టీ-బిల్లు!

shindeటీ-బిల్లు త్వరలోనే అసెంబ్లీకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. నిన్న ఢిల్లీలో షిండే విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రాతికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..  టీ-బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోరుతూ.. రాష్ట్రపతి ఏపీ అసెంబ్లీకి పంపారని, అందుకు జనవరి 23తేది వరకు గడువు ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీ గడువు అనంతరం టీ-బిల్లు మా వద్దకు వస్తుందని.. రాగానే పార్లమెంట్ లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, టీ-బిల్లుపై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.