Site icon TeluguMirchi.com

నియంత్రణ రేఖ వద్ద నేడు షిండే పర్యటన !

Suseel-kumar-Shindeనియంత్రణ రేఖ వద్ద దాయాది దేశం పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈరోజు (మంగళవారం) భారత సరిహద్దుల్లోని పలు సెక్టార్లను పరిశీలించనున్నారు. సరిహద్దు సెక్టార్లను పరిశీలించడంతో పాటుగా.. షిండే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ యేడాదిలో పాకిస్థాన్ ఇప్పటివరకు 136సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఒకే యేడాదిలో ఇన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడం ఇదే మొదటిసారి. షిండే పర్యటన తర్వాత భారత్ దాయాది పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేసే అవకాశం వున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version