త్వరలోనే.. తెలంగాణపై తేల్చేస్తాం !

shindeతెలంగాణ అంశపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పాతపాటనే కొత్తగా పాడారు. త్వరలోనే తెలంగాణ అంశాన్ని తేల్చేస్తామని ఆయన అన్నారు. ఢీల్లీలో షిండే ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించనున్నామని, త్వరలోనే తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే తెలంగాణపై తేల్చేస్తామని చెప్పడమే గానీ.. అది కాంగ్రెస్ పార్టీ పరంగానా, యూపీఏ ప్రభుత్వం
పరంగానా.. తేల్చేస్తే ఎప్పటిలోగా మాత్రం స్పష్టంగా చెప్పకపోవడం విశేషం.