Site icon TeluguMirchi.com

కాలపరిమితికి ముందే తెలంగాణ బిల్లు !

shindeతెలంగాణ బిల్లు కాలపరిమితికి ముందే వస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఢిల్లీ ఈరోజు షిండే విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అన్న అంశంపై వివిధ అభిప్రాయాలున్నాయని, శ్రీకృష్ణ కమిటీ కూడా పలు సూచనలు చేసిందని చెప్పుకొచ్చారు. వీటన్నింటిని జీవోఎం పరిశీలిస్తుందని ఆయన అన్నారు. అయితే, గతంలో కూడా పలుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించామని.. రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశం కూడా అలాంటిదేనని షిండే తెలిపారు. కాగా, ఈరోజు ఉదయం జీవోఎంతో ఆయా శాఖల కార్యదర్శులు సమావేశమయిన విషయం తెలిసిందే.

Exit mobile version