Site icon TeluguMirchi.com

ముఖ్యమంత్రులతో షిండే !

Shinde1కౌంటర్ టెర్రరిజంపై అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమావేశం నిర్వహించారు. విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుండి సిఎస్, డిజిపిలు హాజరయ్యారు. పోలీసు శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎంలతో షిండే చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, హోం మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు సిఎంలు డుమ్మా కొట్టారు. దేశ శాంతి భద్రతలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి సైతం సీఎంలు డుమ్మాకొట్టడం.. ప్రజలకు రక్షణ కల్పించడంపై వారికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version