తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే

Shinde1ఇష్రాత్ జహాన్ హత్యాకేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ బూటకమని సీబీఐ పేర్కొనడంపై షిండే స్పందిస్తూ.. ముక్కు పచ్చలారని బాలికను దారుణంగా ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు శిక్షార్హులన్నారు. వాస్తవాలు వాస్తవాలేనని, తప్పు ఎవరు చేసినా శిక్షించవలసిందేనని షిండే పేర్కొన్నారు. ఈ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో హోంమంత్రిత్వ శాఖ కిందికి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులూ ఉండడంతో.. షిండే వ్యాఖ్యలు ప్రాధ్యాన్యం సంతరించుకున్నాయి.