Site icon TeluguMirchi.com

‘మరో ప్రజా ప్రస్థానం’ కు మరో బ్రేక్

sharmila-maroprajaprasthanaజగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రెండో రోజు కూడా బ్రేక్ పడనుంది. కాలు బెణకడం వల్ల మొదట షర్మిల సోమవారం ఒక్కరోజు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే, ఈ రోజు ఆమెను పరిశీలించిన వైద్యులు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో మంగళవారం కూడా ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని బూడిదపాడులో సభ ముగించుకొని పవర్ గ్రిడ్ వద్ద మధ్యాహ్నం బస చేసేందుకు వెళ్తుంగా అక్కడ షర్మిల కాలు జారి బెణికిన సంగతి తెలిసిందే.

Exit mobile version