Site icon TeluguMirchi.com

ఆనంకు సవాల్ విసిరిన షర్మిల..!

sharmila-fireరాష్ర్ట ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వైఎస్ జగన్ సోదరి షర్మిల సవాల్ విసిరారు. వైఎస్ పై నమ్మకంతో మంత్రులు చేసిన పనుల వలనే ఇప్పుడు మంత్రులందరు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొవలసివచ్చింది, బయ్యారం గనుల వ్యవహారంలో జగన్ ధోషియే అని ఆనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. షర్మిల ధీటైన సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. ఆనం చేసిన ఆరోపణలపై ఆమె సవాళ్లు కూడా విసిరారు. “బయ్యారం గనుల్లో తమకు సంబంధం ఉందని రుజువు చేస్తే పాదయాత్ర నిలిపివేసి వెళ్లిపోతానని, లేకుంటే క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేస్తారా” అని ఆమె ఆనంకు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో “మరో ప్రజా ప్రస్థానం” పాదయాత్ర చేస్తున్న షర్మిల ఆనం వ్యాఖ్యలపై చాలా ఘూటుగా స్పందించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వైఎస్ ఆర్ సొంత తమ్ముడిలా చూసుకుని మంత్రిని చేస్తే, కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఆయన మాట్లాడారని షర్మిల వ్యాఖ్యనించారు. ఏనాడు సచివాలయానికి కూడా రాని జగన్ ను అన్ని మాటలు అనడానికి నోరు ఎలా వచ్చింది. మీరు మనుషులేనా? అని ఆమె అన్నారు. మాఫియా డాన్ బొత్స కు ఏ కోర్టు నిర్ధోషి అని తేల్చిందని షర్మిల ప్రశ్నించింది. మరీ.. షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి !

Exit mobile version