Site icon TeluguMirchi.com

సీమాంధ్ర ఎంపీల భేటీ !

lagadapatiఢిల్లీలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈరోజు (సోమవారం) కేంద్రం నుంచి తెలంగాణపై ప్రకటన వస్తోందని భావిస్తున్న నేపథ్యంలో.. వీరి భేటీ మరింత ప్రాధన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటన మాత్రమే వచ్చింది. అయితే, ఈరోజు కేంద్రం తరుపున హోం మంత్రి షిండే తెలంగాణపై ప్రకటన చేయనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు చివరి ప్రయత్నంగా అధిష్టానంపై ఒత్తిడిని పెంచి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version