Site icon TeluguMirchi.com

సీమాంధ్ర ఉపాధ్యయులూ.. సమ్మెబాట

teachersసమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాలలో నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా, రేపటి అర్థరాత్రి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శకి ఈరోజు సమ్మె నోటీసు అందజేసినట్లు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి వెల్లడించింది. ఈ సమ్మెలో దాదాపు 2.5లక్షల సీమాంధ్ర ఉపాధ్యాయులు పాల్గొననున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు సమ్మెలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Exit mobile version