Site icon TeluguMirchi.com

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ !

Lagadapati Rajagopalసీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు (బుధవారం) ఢిల్లీలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని సీమాంధ్ర ఎంపీలు నిన్నటి వరకు అధిష్టాన పెద్దల వద్ద బోరుమన్న విషయం తెలిసిందే. అయితే, అధిష్టాన పెద్దలతో పాటుగా, అధినేత్రి సోనియా గాంధీ విభజన తథ్యమని, నిర్ణయం వెనక్కు తీసుకునేదిలేదని తేల్చిచెప్పడంతో.. ఎంపీలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేక ప్యాకేజీలు, హైదరాబాద్ అంశంతోపాటుగా, ప్రాంతాల వారీగా డిమాండ్లు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఎంపీల సమావేశంలో సీమాంధ్రకు చెందిన ఏ మంత్రి కూడా పాల్గొనకపోవడం విశేషం.

Exit mobile version