చిరుతో సీమాంధ్ర నేతల చర్చలు !

chiranjeevi1కేంద్ర మంత్రి చిరంజీవితో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు ఒకరి తరవాత మరోకరి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశాలలో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీమాంధ్రలో ప్రజాభిమానం పొందుటునకు అనుసరించాల్సిన భవిష్యత్ కార్యచరణపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. లోక్ సభ నుంచి సీమాంధ్రకు చెందిన 12 ఎంపీలను సస్పెండ్ చేసినప్ప్పటికినీ.. దానికి ప్రజలు నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడం పట్ల నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖతమని అంటున్న తెదేపా ఎంపీల వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.