Site icon TeluguMirchi.com

కొనసాగుతున్న సమైక్య బంద్!!

seemandhra-bandhసీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నాయి. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆఖరి పోరాటంతో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొనాలని ఏపీ ఎన్జీవోలు పిలుపునివ్వడంతో.. సీమాంధ్ర బంద్ ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఏపీ ఎన్జీవోల బంద్ కు సీమాంధ్ర తెదేపా నేతలు మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ లో టీ-బిల్లును ఓడించే బాధ్యత సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలదేనని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కాగా, విభజన బిల్లును నేడు పార్లమెంట్ లో  ప్రవేశపెట్టనున్నందుకు నిరసనగా ఏపీ ఎన్జీవోలు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version