Site icon TeluguMirchi.com

ప్రధానితో భేటీయైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు

pm manmohanసీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా హాజరయ్యారు. తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినేట్ ఆమోదించిన తరవాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులను మంత్రులు ప్రధానికి వివరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. సీమాంధ్రలో చెలరేగుతున్న ఆందోళనలపై ప్రధానితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్ ను ఆమోదించిన నేపథ్యంలో… సీమాంధ్రకు చెందిన కేంద్రం మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు ప్రటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమవ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Exit mobile version