Site icon TeluguMirchi.com

ప్రధానికి సమస్యల చిట్టా !

seemandhraప్రదాని మన్మోహన్ సింగ్ కు సమస్యల చిట్టా అందజేసేందుకు రెడీ అయ్యారు సీమాంధ్ర కేంద్రమంత్రులు. దీనిపై ఇప్పటికే ఆరు పేజీల నివేదికను కూడా రూపొందించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు నేడు ప్రదాని మన్మోహన్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆరు పేజీలతో పొందుపరచిన సమస్యల చిట్టాను ప్రధాని ముందు వుంచనున్నారు. ఇప్పటికే జీవోఎంకు మంత్రులు పలు డిమాండ్లతో కూడిన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, విభజన అనివార్యమైన పరిస్ధితుల్లో సీమాంధ్రకు భారీ ప్యాకేజీ కేటాయించాలనే డిమాండ్ తో సీమాంధ్ర కేంద్రమంత్రులు ముందుకు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Exit mobile version