ఎక్కడివి.. అక్కడే.. !!

seemandra-bandhసీమాంధ్ర బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. టీ-బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఏపీ ఎన్జీవోలు నేడు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సీమాంధ్ర బంద్ కారణంగా నేడు జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎపీ ఎన్జీవోల బంద్ కు సీమాంధ్ర తెదేపా నేతలు మద్దతు ప్రకటించారు. సీమాంధ్ర 13జిల్లాలో ప్రజలు స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా, బంద్ కారణంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.