28న సీమాంధ్ర న్యాయవాదుల భహిరంగ సభ

seemandhra-advocatesహైదరాబాదులో ఏపీఎన్జీవోలు విజయవంతంగా నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఇతర రంగాలవారికి స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మళ్లీ మానవహారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. అందుకు సహకరించాలని ఆయన తెలంగాణ అడ్వకేట్స్ను కోరారు. సమైక్యాంధ్ర కోరుతున్న అడ్వకేట్స్ అందరితో ఈ నెల 28న ఓ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మానవహారానికి సిద్దమైన సీమాంధ్ర అడ్వకేట్స్పై తెలంగాణ లాయర్ల దాడిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అందుకు నిరసనగా మంగళవారం హైకోర్టు ఆవరణలో సీమాంధ్ర అడ్వకేట్స్ బైటాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.