Site icon TeluguMirchi.com

రజనీ పై తీవ్ర వ్యాఖ్యలు


సూపర్ స్టార్ రజనీకాంత్ స్థానికత పై కొందరు వివాదం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుడు కాని రజనీ తమిళనాడును ఎలా పాలిస్తారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ రజనీ పైతీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో పుట్టినవారికి మాత్రమే తమిళనాడును పాలించే అర్హత ఉందని, ఎవరు తమిళుడో .. ఎవరు తమిళుడు కాదో అందరికీ తెలుసని అన్నరు

తమిళనాడును పాలించే హక్కు కేవలం శరత్ కుమార్, కార్తీక్ లకు మాత్రమే ఉందని భిప్రాయపడ్డ ఆయన… కావేరీ నది నుంచి చుక్క నీటిని కర్ణాటక ఇవ్వలేదని , అలాంటప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తిని సీఎంగా తాము ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. ఈ విషయంలో తమ పోరాటం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు సీమాన్

Exit mobile version