5గురు తీవ్రవాదులు హతం !

indianarmyజమ్మూకాశ్మీర్ లోని గండర్ బల్ జిల్లాలోని ప్రంగ్ సమీపంలోని నజవాన్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సైన్యానికి, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మృతి చెందినట్లు సైన్యం ప్రకటించింది. నజవాన్ అడవుల్లో కాశ్మీర్ పోలీసులు, 24వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన భద్రతదళాలు గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో తీవ్రవాదులు తారసపడినట్లు తెలుస్తోంది. వీరంతా లష్కరే తోయిబా సంస్థకు చెందిన అసదుల్లా వర్గానికి చెందిన వారని హోంశాఖ తెలిపింది.