‘గెలుపు గుర్రాలకే’ సీట్లు : బాబు

NCBN2014 ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా.. అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర నిర్వహిస్తున్న బాబు..ఈరోజు (మంగళ వారం) కాకినాడలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో బాబు కాకినాడ నగర, గ్రామీణ నియోజకవర్గాల పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీట్ల ఎంపికలో కార్యకర్తల నుంచి వచ్చే సమాచారం పార్టీ అగ్రనాయత్వానికి ఎంతో ఉపకరిస్తుందని సూచించారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం ఉండబోదని బాబు స్పష్టం చేశారు.