రాడియా రహస్య విచారణ!

niraradiya2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం లో నీరా రాడియా సంభాషణల కేసులో సుప్రీం కోర్టు రహస్య విచారణను ప్రారంభించింది. ప్రభుత్వ న్యాయవాది, సీబీఐ, ఇన్ కమ్ టాక్స్ అధికారులు మినహా మరెవరూ ఈ విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. నీరా రాడియా కార్పొరేట్ లాబీయిస్టు గా తొమ్మిదేళ్ల సమయంలో కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన వైనం 2007లో వెలుగులోకి వచ్చింది. కాగ ఈ కేసులో నీరా రాడియా మాట్లాడిన 62 ఫోన్ సంభాషణల సీడీల తో విచారణ సాగుతోంది.