ప్రజాస్వామ్యాన్ని రక్షించండి-ఆంధ్రపదేశ్ ను రక్షించండి!

kiran-gokavaram(1)ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీలో మౌనదీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమంలో.. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పలు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు కూడా ఏపీ భవన్ చేరుకున్నాయి. ముఖ్యమంత్రి దీక్షలో వీరు సైతం పాల్గొననున్నారు. జంతర్ మంతర్ వద్ద సీఎం దీక్ష చేపట్టనున్నారు. దీక్షా స్థలం వద్ద “ప్రజాస్వామ్యాన్ని రక్షించండి-ఆంధ్రపదేశ్ ను రక్షించండి” అనే స్లోగన్ ను ప్రధానంగా వుంచారు. దీనితోపాటుగా టీ-బిల్లును అసెంబ్లీ తిరస్కరించింది అన్న వ్యాఖ్యాలను ఏర్పాటు చేయడం విశేషం. ముందుగా మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించి.. కిరణ్ దీక్షాస్థలికి చేరుకుంటారు. అయితే, ఈరోజు సాయంత్రం కిరణ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. కాగా, రాత్రి 8.30గంటలకు ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు.