ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసు లో జైలు పాలైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను ముంబయి జైలు నుంచి పూణె ఎరవాడ జైలుకు తరలించారు. అత్యంత భద్రత మధ్య సంజయ్ను ఈరోజు తెల్లవారుజామున ఓ వ్యాన్లో తరలించినట్లు సమాచారం. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ళ కేసులో దత్ ఈనెల 16వ తేదీన టాడా కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎర్రవాడ జైలు సంజు కి కొత్తేం కాదు. గతంలో సంజయ్ దత్ ఈ ఎర్రవాడ జైలులో 42 నెలలు శిక్ష అనుభవించనున్నాడు.