సంజయ్ దత్ ప్రాణాలకు ముప్పుందట !

sanjaydutప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రాణాలకు ముప్పువుందని ఆర్ధర్ రోడ్ జైలు అధికారులకు ఆగంతుకుడు లేఖ రాశాడు. సనాతన వాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తాను పూణేలోని ఎరవాడ జైలులో లొంగిపోతానంటూ నిన్న టాడా కోర్టులో పిటీషన్ వేసిన సంజయ్ దత్ ఆ పిటిషన్ ను ఈ రోజు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో.. భారీ బందోబస్తు కల్పిస్తామని ఆర్థర్ రోడ్ జైలు అధికారులు ప్రకటించారు. కాగా, ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ రేపు కోర్టులో లొంగిపోనున్న సంగతి తెలిసిందే.