Site icon TeluguMirchi.com

కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్ !

sanjayముంబయి వరుస పేలుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈరోజు (గురువారం) టాడా న్యాయస్థానం ముందు లొంగిపోయారు. భారీ బందోబస్తు నడుమ పోలీసులు సంజయ్ దత్ ను కోర్టుకు తరలించారు. కోర్టులో లొంగిపోయిన తరవాత సంజూని పోలీసులు పూణేలోని ఎరవాడ జైలుకి తరలిస్తారు. అక్కడ ఆయనకు వైద్య పరిక్షలు నిర్వహించిన అనంతరం సంజూని జైలులో ఇతర ఖైదీలతో కవకుండా ఆయనకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో సంజూ ఇంకా మూడున్నరేళ్లు శిక్ష అనుభవించాల్సి వుంది. అయితే, సంజూ ఈరోజు కోర్టులో లొంగిపోనుండటంతో ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి హడావుడి మొదలైంది. అభిమానులు, బంధువులు, పులువురు సినీ ప్రముఖులు ఆయన పరామర్శించడాని వచ్చారు. కాగా, 1993లో ముంబాయి వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించగా, దాదాపు 700 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.

Exit mobile version