Site icon TeluguMirchi.com

ఢిల్లీలో సమైక్యగళం !

apngosకేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు గానూ.. ఏపీ ఎన్జీవోలు తమ కార్యచరణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఏపీ ఎన్జీవోలు ఢిల్లీ చేరారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలందరినీ కలసి సమైక్యాంధ్రపై తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు వీరు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 11.45 గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఎన్జీవోలు సమావేశం కానున్నారు. అనంతరం ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, సీపీఎం నేత ప్రకాష్ కారత్, సీపీఐ నేత బర్ధన్, సురవరం.. తదితరులను కలవనున్నారు. అయితే, విభజన సమస్యలను వినేందుకు ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీని కలవాలా..? వద్దా..? అనే విషయంలో ఇంకా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. కాగా, నిన్న సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆంటోని కమిటీతో భేటై చర్చించిన విషయం తెలిసిందే.

Exit mobile version