డిగ్గీరాజాకు సమైక్య సెగ.. !

digvijaysigసమైక్య సెగ దేశ రాజధాని ఢీల్లీకి పాకింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ ఏపీ ఎన్జీవోలు అధిష్టాన పెద్దలతో సమావేశమవుతూ బిజీబిజీగా వున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీ ఎన్జీవోలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరారు. దీనికి బదులుగా దిగ్గీరాజా నిర్ణయం అయిపోయింది…సమస్యలుంటే చెప్పుకోండీ అనడంతో.. ఎన్జీవోలు ఆగ్రహాంతో సమైక్యనినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు దిగ్విజయ్ ఇంటిముందు సమైక్య నినాదాలు హోరెత్తాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి వేసిన శ్రీకృష్ణ కమిటీని అసలు చదివారా..? అని ఎన్జీవోలు ప్రశ్నిస్తున్నారు.