Site icon TeluguMirchi.com

బొత్సకు సమైక్య సెగ !

botsaసీమాంధ్ర నేతలకు సమైక్య సెగ తప్పడం లేదు. సమైక్యానికి సై అన్న నేతలను కూడా ఆందోళనకారులు వదలడం లేదు. తాజాగా, ఈరోజు ఉదయం గరివిడిలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీసును సమైక్య వాదులు ముట్టడించారు. రాష్ట్ర సమైక్యత కోసం బొత్స రాజీనామా చేయాలని ఆందోళన కారులు డిమాండు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

Exit mobile version