బాపిరాజుకు సమైక్యసెగ

kanumuriటీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు తిరుపతిలో సమైక్యసెగ తగిలింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రైలు మార్గంలో వస్తున్నట్టు సమాచారం అందుకున్న శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్థులు రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకుని బాపిరాజును తెల్లవారుజామున 3గంటలకు అడ్డుకున్నారు. సీమాంధ్రలో ఉద్యమం లేదని ఢిల్లీలో చెప్పడంపై విద్యార్థులు మండి పడ్డారు. తక్షణం సీమాంధ్రకు మద్దతుగా రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. తాను సమైక్యవాదినని చెప్పినా విద్యార్థులు శాంతించలేదు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకుని భారీ బందోబస్తు మధ్య కనుమూరిని తిరుమలకు పంపించారు.