అన్ని పార్టీలు మద్దతివ్వాలి: అశోక్ బాబు

ashokbabuరేపటి అఖిలపక్ష సమావేశంలో సమైక్యవాద పార్టీలన్నీ పాల్గొనాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కోరారు. రేపు సమావేశానికి ఏఏ పార్టీలు వస్తాయో, అసెంబ్లీలో ఏం చెబుతాయో చూస్తామని అన్నారు. తమ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. రేపటి సమావేశానికి సమైక్యానికి మద్దతిచ్చే అన్ని పార్టీలను ఆహ్వానించామని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం చరిత్రాత్మకం అని కొనియాడారు. పార్టీలన్నీ తమలో ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టి సమైక్యానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం వల్ల ఎలా ఒత్తిడి పెరిగిందో… తాము కూడా అలాగే ఒత్తిడి పెంచాల్సిన అవసరం వుందని వెల్లడించారు.