Site icon TeluguMirchi.com

బొత్సకు సమైక్య సెగ

botsaపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఢిల్లీలో సమైక్య సెగ తగిలింది. ఢిల్లీలో బొత్స మీడియా సమావేశం జరుగుతుండగా కొందరు సీమాంధ్ర విద్యార్థులు అడ్డుకున్నారు. ’సేవ్ ఆంద్ర ప్రదేశ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని, కాని తన ప్రాంత ప్రజల అబిమతానికి అనుగుణంగా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. విజయనగరంలో విద్యార్థులపై జరిగిన దాడులపై బొత్సను విద్యార్థి సంఘం నేతలు నిలదీశారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. విజయనగరంలో ఎవరిపై దాడులు చేయలేదని, దాడుల జరిగినట్లు తన దృష్టికైతే ఇప్పటివరకూ రాలేదన్నారు. ఒకవేళ దాడులు జరిగితే వాటిని ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Exit mobile version