Site icon TeluguMirchi.com

దేనికైనా రెడీ..!

sailajanath-ministerఅధిష్టానం రాష్ట్ర విభజనకు అనుకూలంగా వుందని వార్తలొస్తున్న నేపథ్యంలో.. సమైక్యవాదులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే దేనికైనా సిద్ధమని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. నిన్న సీమాంధ్ర మంత్రుల సమావేశంలో నిర్ణయించిన విధంగా.. రేపు (శుక్రవారం) సీమాంధ్ర ప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లి తమ వాదనను అధిష్టాన పెద్దలకు వినిపిస్తామని ఆయన తెలిపారు. అయితే, నిన్న సీమాంధ్ర నేతల సమావేశంలో అవసరమైతే.. మంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈరోజు కమాలాపురం ఎమ్మెల్యే వీర శివారెడ్డి సమైక్యాంధ్రకు మద్ధతు రాజీనామా చేశారు.

Exit mobile version