విచారణకు హాజరైన ధర్మాన, సబిత

dhramana sabithaజగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఈరోజు (సోమవారం) విచారణనిమిత్తం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. కాగా, ధర్మాన, సబితను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ న్యాయస్థానం ఈ నెల 19కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.