సీమాంధ్రలో సేమ్ సీన్ !

seemandraరాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ.. సీమాంధ్రలో ఆందోళనలు ఎనిమిదో రోజు కూడా కొనసాగుతున్నాయి. పలుచోట్ల విద్యాసంస్థలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మౌనదీక్షకు దిగింది. మంత్రుల ఇంటి ముట్టడికి ఏపీ ఎన్జీవోలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా మిర్చియార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీమాంధ్ర అన్ని జిల్లాలో ఏదో ఒక రూపంలో ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 12నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవోలు ప్రకటించిన విషయం తెలిసిందే.