వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారే కానీ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని రోజా సూటిగా ప్రశ్నించారు. ప్రచారానికి పెట్టిన ఖర్చులో ఒక్క వంతైనా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారా అని అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టామంటూ.. సీఎం కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు.