Site icon TeluguMirchi.com

రమేష్ దీక్షపై రోజా సెటైర్లు..

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20 నుంచి జడ్పీ కార్యాలయ ఆవరణలో ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. రోజు రోజుకు ఈయన ఆరోగ్యం క్షణిస్తున్న కానీ దీక్ష మాత్రం విరమించడం లేదు. ఈ నేపథ్యం లో వైసీపీ ఎమ్మెల్యే రోజా రమేష్ దీక్ష ఫై సెటైర్లు వేశారు. గత నాలుగేళ్ల పాలనలో గుర్తుకురాని స్టీల్ ప్లాంట్ ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని ఆమె విమర్శించారు.

వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. సీఎం రమేష్ స్టీల్ ప్లాంట్ కోసం కాదని, తన డైట్ కోసం దీక్ష చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఉత్త పప్పు కాదు గన్నేరు పప్పంటూ ఎద్దేవా చేసింది. కంపెనీలు తెచ్చామని లోకేష్‌ గొప్పలు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్‌ను పప్పు అని కాకుండా ఇంకేమని పిలవాలంటూ ఆమె మండిపడ్డారు. పప్పు అంటే ఇన్నిరోజులు విటమిన్‌ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబు త్వరలోనే తెలుసుకుంటారని ఎద్దేవా చేసింది.

Exit mobile version