అంతా పవన్ వల్లే : రోజా

Pawan-Kalyan-rojaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రంగా విరుచుకు పడ్డారు. రుణమాఫీ పైన చంద్రబాబుకు ఏమాత్రం స్పష్టత లేదని ఆమె అన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. చిత్తూరులో ఈరోజు (మంగళవారం) రోజా విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ పైన కాలయాపన చేసేందుకే బాబు.. కమిటీలు అంటూ కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి ఎన్ని కోట్లు కావాలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు చంద్రబాబుకు తెలియదా ? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునే కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రోజా వదలలేదు.

అసలు ఇదంతా జరగడానికి పవన్ నే కారణమని ఆరోపించింది. పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఎన్నికలలో గెలిచిందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి రైతుల రుణమాఫీకి పవన్ కళ్యాణ్ కు ముడిపెట్టి కూర్చోంది. దీనిపై ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఏం సెబితిరి.. ఏం సెబితిరీ.. “అంటూ పవన్ స్టయిల్ సోషన్ నెట్ వర్క్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు. తాజా రోజా కమెంట్స్ పై పవన్ ఎలా స్పందిస్తాడో..