Site icon TeluguMirchi.com

తెలంగాణపై తీర్మాణం..!

TELANGANAతెలంగాణ రాజకీయ ఐకాస ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో.. ప్రత్యేక తెలంగాణ పై తీర్మాణం చేశారు. హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా అని రాజకీయ పక్షాలతో కలిసి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని కూడా తీర్మానించారు.

తెలంగాణ జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నేతలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించే వరకూ.. తమ ఉద్యమ కార్యచరణను కొనసాగిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. కాగా, రెండుమూడురోజుల్లో.. జేఏసీ చైర్మెన్ ప్రొ. కోదండరాం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version