Site icon TeluguMirchi.com

సమైక్యం కోసం మంత్రిపదవులకు రాజీనామా

Gantaసమైక్యవాదం కోసం పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సీమాంధ్ర మంత్రులు ప్రకటించారు. భవిష్యత్ కార్యచరణపై మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమయిన సీమాంధ్ర మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శైలాజ నాథ్ వెల్లడించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది తమ డిమాండ్ అని ఆయన అన్నారు. రాజీనామాల నిర్ణయం జరిగిన కాసేపటికి మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ప్రకటించారు. అలాగే అదికార భాష సంఘం అద్యక్షుడు బుద్దప్రసాద్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక వీరి దారిలోనే మిగిలిన మంత్రులు కూడా నడిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version