Site icon TeluguMirchi.com

కోర్టులో జానారెడ్డికి ఊరట !

janareddyపంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్ నుహైకోర్టు కొట్టివేసింది. అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ సీబీఐతో విచారణ జరిపించాలనడం ఊతపదంగా మారిందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. ఈ పిటిషన్ వేసి కోర్టును తప్పుదారి పట్టించినందుకు గానూ పిటిషనర్ వీవీ రావుకు రూ.10వేల జరిమానా విధించింది. వీవీ రావు కూకట్ పల్లికి చెందిన సామాజిక కార్యకర్త.

Exit mobile version