ధర్మాన, సబితలకు ఊరట !

Sabitha-Dharmanaజగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు ఊరట కలిగింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది. వీరిపై సీబీఐ దాఖలు చేసిన మెమో పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేసారన్న ఆరోపణలపై ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఈ విషయంలో నిందితులను తప్పుపట్టలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా, కోర్టు తీర్పు పట్లు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది వారు పేర్కొన్నారు.