అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కౌన్సిలింగ్ పేరుతోపార్టీ కార్యకర్తలను వేదిస్తున్నరంటూ రామచంద్రారెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆయన పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని గమనించిన పార్టీ కార్యకర్తలు కాపు రామచంద్రారెడ్డిని ఆస్పత్రికి తరలించారు.