Site icon TeluguMirchi.com

శ్రీదేవిపై రాజ్‌ ఠాక్రే సంచలన కామెంట్స్

శ్రీదేవిపై రాజ్‌ ఠాక్రే సంచలన కామెంట్స్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే,శ్రీదేవిపై సంచలన ఆరోపణలు చేశారు. నీరవ్‌ మోదీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే శ్రీదేవి అత్యక్రియలకు అంతలా హడావిడి చేశారని ఆరోపించారు.

‘శ్రీదేవి గొప్ప నటి కావచ్చు కానీ ఆమె దేశానికి ఏం సేవ చేశారు? ఆమె భౌతికాయంపై తివర్ణ పతాకం ఎందుకు ఉంచారు? అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? బీజేపీయేతర ముఖ్యమంత్రి ఇలా చేసివుంటే మీడియా గగ్గోలు పెట్టేది. మోదీ ప్రభుత్వానికి భయపడే మీడియా నోరు మెదపడం లేద’ని వ్యాఖ్యానించారు రాజ్‌ ఠాక్రే. ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ముక్‌ భారత్‌’ కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version