‘శ్రీదేవి గొప్ప నటి కావచ్చు కానీ ఆమె దేశానికి ఏం సేవ చేశారు? ఆమె భౌతికాయంపై తివర్ణ పతాకం ఎందుకు ఉంచారు? అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? బీజేపీయేతర ముఖ్యమంత్రి ఇలా చేసివుంటే మీడియా గగ్గోలు పెట్టేది. మోదీ ప్రభుత్వానికి భయపడే మీడియా నోరు మెదపడం లేద’ని వ్యాఖ్యానించారు రాజ్ ఠాక్రే. ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ముక్ భారత్’ కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.