Site icon TeluguMirchi.com

రైల్వే ఛార్జీల పెంపు సరైనదే : చిదంబరం

CHIDAMBARAMకేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం రైల్వే టిక్కెట్ల ఛార్జీలు పెంచడాన్ని సమర్ధించారు. దాదాపు పదేళ్ల తర్వాత రైలు ఛార్జీలు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. రైల్వే ఆర్థిక పిరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రైల్వేలో భద్రత, పరిశుభ్రతను పెంచేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. టిక్కెట్ పై 20 శాతం వరకు ఛార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. కాగా, పెరిగిన ఛార్జీలు జనవరి21 అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.

Exit mobile version