మళ్లీ.. తెరపైకి తెలంగాణ !

rahul-gandi-telanganaకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ నెల 18న సీఎం కిరణ్, పిసీసీ ఛీఫ్ బొత్స సత్యానారాయణలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు ఒక్కొక్కరిగా తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ తెలంగాణపై మరింత దృష్టి కేంద్రికరించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి సబిత రాజీనామా వ్యవహారం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఈ సమావేశంలో… మంత్రి వర్గ విస్తరణ, తెలంగాణ అంశంపై సీఎం, పీసీసీ ఛీఫ్ లతో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.