Site icon TeluguMirchi.com

రాహుల్ తో రాష్ర్ట కాంగ్రెస్ ఎంపీల భేటీ !

rahul-meet-with-ap-mp'sఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం గంటన్నరకు పైగా సాగింది. ఈ భేటీలో రాష్ర్టంలో తాజా రాజకీయపరిణామాలతో పాటుగా తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. భేటీ అనంతరం ఎంపీలు విలేకర్లతో మాట్లాడుతూ… త్వరలోనే రాహుల్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ సమావేశమవుతారని వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత సమస్యలను కూడా ఎంపీలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Exit mobile version