సమ్మెను విరమించండి : రఘువీరా

raghuveera-reddy-సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలు విరమించాలని మంత్రి రఘువీరా రెడ్డి కోరారు. ఉద్యమం పేరుతో.. ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధలుగా ఉద్యమం చేపట్టాల్సిన బాధ్యత మాపైన వుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజీనామాలు చేస్తే.. రాష్ట్రపతి పాలన వస్తుందని.. అప్పుడు చేయగలిగింది ఏముండదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని.. అధిష్టానాన్ని ఒప్పించేందుకు కృషిచేస్తామని రఘువీరా అన్నారు. విభజన విషయంలో ఇప్పటివరకూ.. పార్టీ నిర్ణయమే జరిగిందని, ఇంకా ప్రభుత్వ నిర్ణయం జరగలేదని ఆయన అన్నారు. సమ్మె వల్ల తలెత్తే ఇబ్బందును గుర్తుపెట్టుకొని ఉద్యోగులు సమ్మెను విరమించాలని రఘువీరా కోరారు.