తెరాస వసూళ్ల చిట్టాను జేడీకి అందించా : రఘునందన్

raghunandhanతెరాస బహిష్క్రతనేత రఘునందనరావు ఈరోజు (మంగళవారం) సీబీఐ కార్యాలయంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. అనంతరం రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. తెరాసకు సంబంధించిన అక్రమ వసూళ్లపై సీబీఐకి ఆధారాలు అందజేశానని తెలిపారు. తెరాస గతంలో జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ తెరాసతో జరిపిన లావాదేవీల వివరాలు రాతపూర్వకంగా జేడీకి అందించినట్లు ఆయన వెల్లడించారు. అయితే, తాను ఇచ్చిన సమాచారంపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం నిర్ణయం అనంతరం తనను పిలిపిస్తామని జేడీ అన్నట్లు రఘునందన్ పేర్కొన్నారు. ఇటీవల తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్ రావు తెరాసపై మరియు ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అందులోనే భాగంగానే కొన్ని ఆధారాలతో ఆయన సీబీఐ జేడీని కలిసినట్లు సమాచారం.